Friday, January 29, 2016

చింతపండు పులిహోర

కావలసిన పదార్థాలు:--

పొడిపొడిగా వండిన అన్నం -1 కప్పు
చింతపండు గుజ్జు -పావు కప్పు
పచ్చిమిర్చి -6(నిలువుగా చీల్చి ఉంచుకోవాలి)
ఎండుమిర్చి -3
పోపుదినుసులు - తగినన్ని(మినప్పప్పు , శెనగపప్పు , ఆవాలు)
కరివేపాకు రెబ్బలు -కొద్దిగా
పసుపు,ఉప్పు -రుచికి తగినంత 
ఇంగువ -1/2 స్పూన్
నూనె -1/4 కప్పు 
వేరుశెనగ పప్పు -పావుకప్పు            

తయారీవిధానం:--

1.ముందుగా స్టవ్ వెలిగించుకొని, బాణలి చింతపండుగుజ్జులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి చింతపండు దగ్గరపడేవరకు మగ్గించి, పక్కనపెట్టుకోవాలి.
2.ఇప్పుడు మల్లి బాణలి పెట్టి నూనెవేసి, పోపుదినుసులు, వేరుశెనగగుళ్ళు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, అన్నీ వేసి బాగా వేగాక కొంచెం పోపును తీసి పక్కన పెట్టుకోవాలి, మిగిలినపోపులో మగ్గించి పక్కనపెట్టుకున్న చింతపండుగుజ్జును వేసి, 5 నిముషాలు ఉంచి, దించి ఒక బేసనలో ఉంచుకొన్న అన్నం మీద పోపుని, చింతపండుతో కలిసిన పోపుని వేసి బాగా కలియబెట్టాలి.
3.అంతా కలిసాక పైన మిగిలిన నూనెను వేసి మరొక్కసారి కలపాలి. 
4.అంతే కమ్మని వాసనగల చింతపండు పులిహోర రెడీ. పండుగనాడు ప్రతీఒక్క ఇంట్లోను చేసుకొనే ప్రసాదములలో ఇది ముందుగా ఉంటుంది. ఎందుకంటే పర్వదినాలలో పసుపుఅన్నం తప్పనిసరిగా చెయ్యాలని ..... అందరూ చేస్తారు 
                                    

No comments:

Post a Comment

ధన్యవాదములు.